శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని మొరంపల్లి గ్రామంలో సోమవారం చిలమత్తూరు హర్ష స్వామి ఆధ్వర్యంలో ఘనంగా శివాలయంలో మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో అక్కడికి చేరుకొని శివాలయంలో అభిషేకం కార్యక్రమం చేపట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హర్ష స్వామి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.