గోవధ నేరం ఎస్ఐ కే.ఎం లింగన్న

72చూసినవారు
గోవధ నేరం ఎస్ఐ కే.ఎం లింగన్న
పవిత్ర బక్రీద్ పండగ రానున్న సందర్భంగా ముస్లిం సోదరులు గోవధ చేయరాదని సూచించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని కదిరి పూలకుంట, అల్లుగుండు గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీ మత పెద్దలతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు శాంతియుత కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ రవికుమార్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గోవు పవిత్రమైందని గోవధ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్