చిరుత పులి సంచారం : నల్లచెరువు మండలంలో ప్రజలకు హెచ్చరిక

83చూసినవారు
చిరుత పులి సంచారం : నల్లచెరువు మండలంలో ప్రజలకు హెచ్చరిక
శ్రీ సత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లి మరియు రాట్నాలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులు మరియు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పులి ఆనవాళ్లను గుర్తించారు. ఆ ప్రాంతంలో నివసించే చిన్నపిల్లలు మరియు గ్రామస్తులు బయటకు రాకూడదని ఎస్సై లింగన్న ప్రజలకు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్