గుట్టూరులో భారీగా ట్రాఫిక్ అంతరాయం

561చూసినవారు
పెనుకొండ మండలం గుట్టూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీగా వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కియా ఎస్ఐ రాజేశ్, అతని బృందం అక్కడకు చేరుకుని వాహనదారులను అప్రమత్తం చేసి జేసీబీ సాయంతో నీటిలో ఇరుక్కున్న వాహనాలు పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో దాదాపు ఐదు కీలో మిటర్లు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్