ప్రభుత్వం శాస్త్రీయపద్ధతిలో నాగవల్లి వంశధార అనుసంధానం చేయాలి

58చూసినవారు
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుతీరునున్న కూటమి ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో నాగావళి, వంశధార నదుల అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన బూర్జ మండల కేంద్రంలో మాట్లాడుతూ. జిల్లాలో ఎన్నో వేల ఎకరాల సాగు భూములకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్