ఆముదాలవలస సర్కిల్ అధికారిగా పి సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురంజిల్లా ఎల్విన్ పేట సర్కిల్ అధికారిగా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల జరిగిన బదిలీ కారణంగా ఆముదాలవలసలో వచ్చి జాయిన్ అయ్యారు. కొత్తగా సీఐ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఇంతవరకు పని చేసిన సీఐ దివాకర్ యాదవ్ బాధ్యతలను అప్పగించారు. ఆమదాలవలస సర్కిల్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన సీఐ అన్నారు.