51 రకాల వంటకాలతో నైవేద్యం

76చూసినవారు
51 రకాల వంటకాలతో నైవేద్యం
టెక్కలి మండలంలో స్థానిక ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్ లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా.. శనివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం 51 రకాల పిండి వంటకాలతో ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం రాత్రి ఓంకారం, శివలింగాకారంలో ఏర్పాటు చేసిన దీపాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. వివిధ కార్యక్రమాలతో వీధిలో చిన్నారులు, పెద్దలు కలిసి నాత్యాలు చేస్తూ కళకళలాడింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వీధి మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్