రాష్ట్రంలో సంక్షేమపథకాలు కొనసాగాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజల కోరుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 2 వవార్డు వైయస్సార్సీపి నాయకుడు కూన రామకృష్ణ ఆధ్వర్యంలో కృష్ణాపురంలో ఇంటింటప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 98శాతం ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అవి కొనసాగాలంటే సీఎంగా జగన్ ఉండాలన్నారు.