కులం పేరుతో దుర్భాషలడడం సరికాదు - జేఏసీ నాయకులు

66చూసినవారు
డా. బిఆర్ఏయూ ఉపకులపతి కె. ఆర్ రజిని, రిజిస్ట్రార్ సుజాతల పట్ల నిన్న తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకులు అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం, కులం పేరుతో దుర్భాషలడడం సరికాదని దళిత సంఘాల జేఏసి నాయకులు అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో శుక్రవారం జేఏసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉపకులపతిని రాజీనామా చేయమనడం ఎంతవరకు సమంజసమని, ఇటువంటి కవ్యంపు చర్యలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్