చెత్త సంపద కేంద్రాలను వినియోగించుకోవాలి

71చూసినవారు
చెత్త సంపద కేంద్రాలను వినియోగించుకోవాలి
చెత్త సంపద కేంద్రాలను వినియోగించుకోవాలని టెక్కలి డివిజన్ డిఎల్పిఓ రమణ తెలిపారు. ఆదివారం మెలియాపుట్టి మండలం పరశురాంపురం చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామాల నుంచి సేకరించిన చెత్తను ఈ కేంద్రానికి తరలించి ఎరువులను తయారు చేసుకోవాలని సూచించారు. ఎరువులు వాడి ఆరోగ్య కరమైన పంటలు పండించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, వి హెచ్ ఓ. శరత్ కుమార్ రెడ్డి, గ్రీన్ అంబాసిడర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్