కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సోమవారం కల్లూరు మండలం కొంగనపాడులో రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లడానికి ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే కాటసాని వెళ్తానని పట్టుబట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.