AP: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు సోమవారంతో ముగియనుంది. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ గుంటూరు కలెక్టరేట్లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.