కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. "వాళ్లిద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తా. వాళ్ల అంతు తేల్చేందుకే తూర్పు గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నా. డొక్కు స్కూటర్పై తిరిగే కన్నబాబు.. చిరంజీవి భిక్షతో ఈ స్థాయికి వచ్చారు. చిరంజీవిని జగన్ అవమానిస్తుంటే.. కన్నబాబు ఏం చేస్తున్నారు?" అని పవన్ ప్రశ్నించారు.