మంత్రముగ్ధులను చేసిన భరతనాట్య ప్రదర్శన

81చూసినవారు
తిరుచానూరు వద్దగల శిల్పారామంలో ప్రత్యేక సందర్భాలలో సందర్శకులను అలరించడానికి నాట్య ప్రదర్శనలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తిరుపతి కి చెందిన మంజుల కళానిధి వారి బృందం చే భరత నాట్యం ప్రత్యేక నృత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని ఆంగికం, వాచికం, అభినయం తో చూపరులను మంత్రముగ్ధులను చేశారు.

సంబంధిత పోస్ట్