లబ్ధిదారుని చెంతకే పింఛన్

85చూసినవారు
లబ్ధిదారుని చెంతకే పింఛన్
నగరి మున్సిపాలిటీ ఇందిరా నగర్ సచివాలయానికి సంబంధించిన ఏ.ఎం.మాలిక్ అనే లబ్ధిదారురుడు మూత్ర పిండాలు సమస్యతో బాధపడుతున్నారు, పెన్షన్ అందజేయాలంటే లబ్ధిదారుల యొక్క బొటనవేలు ముద్ర గానీ, కంటి యొక్క ఐరైస్ తప్పనిసరి. అయితే మూత్రపిండాల సమస్యతో చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ యందు చికిత్స పొందుతున్న లబ్ధిదారుడు వార్డుకు వచ్చి పెన్షన్ అందుకోలేని పరిస్థితి. ఇది గుర్తించిన సచివాలయ వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ మురళి, నగరి మున్సిపాలిటీ కమిషనర్.కే.వీ.కృష్ణా రెడ్డికి సమాచారం అందించడంతో, మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాల మేరకు చెన్నైలోని లబ్ధిదారుడు చికిత్స పొందుతున్న వైద్యశాలకు చేరుకొని అక్కడ అతనికి పెన్షన్ అందించారు.

సంబంధిత పోస్ట్