నగరి ఆర్డీఓకు నిరసన సెగ

61చూసినవారు
నగరి ఆర్డీఓకు నిరసన సెగ
బీఎల్ఓ విధుల ముసుగులో నగరి ఆర్డీఓ, సచివాలయం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సచివాలయం ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున నగరి ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పారితోషికం బకాయిలను చెల్లించాలని, వేధింపులు ఆపాలని సచివాలయం ఉద్యోగుల సంఘాలు వినతి పత్రాన్ని అందజేశారు. అన్ని మండలాల నుండి సచివాలయం ఉద్యోగులు నగరికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్