రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు సీఎంగా రావాలని తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. సూళ్లూరుపేట మండలం సర్వారెడ్డి కండ్రిగలో సోమవారం స్థానిక నాయకులు వేనాటి మహేష్ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ను సైకిల్, కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.