గురువారం సాయంత్రం నాయుడుపేట మండలం,నరసారెడ్డి కండ్రిగ వద్ద జరగబోయే సీఎం సభ సందర్భంగా ట్రాఫిక్ ను మళ్ళించినట్టు నాయుడుపేట పోలీసులు తెలియజేశారు. నెల్లూరు నుండి తిరుపతి, కాళహస్తి వెళ్ళే వాహనాలు గూడూరు నుండి బాలయపల్లి, వెంకటగిరి వైపుగా వెళ్తాయని, చెన్నై వెళ్ళే వాహనాలు పండ్లూరు మీదుగా వెళ్తాయని, చెన్నై నుండి నెల్లూరు వెళ్ళే వాహనాలు నరసారెడ్డి కండ్రిగ నుండి మర్లపల్లి మీదుగా వెళ్తాయని పోలీసులు తెలిపారు.