తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో మంగళవారం ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి బంగారు ముఖబింభం, బంగారు వజ్ర కిరీటం, కూరగాయలతో శాకాంబరీ దేవీ అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 9గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని నిర్వాహకులు చెప్పారు.