గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

74చూసినవారు
గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో(బాలికల), ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 3, 4, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను లాటరీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియాగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్