వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో 11 మంది వలంటీర్లు
మంగళవారం రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో ప్రభాకర్ కు అందజేశారు. మండలం లోని చీపినాపి సచివాలయం పరిధిలో ఐదుగురు, పర్లకొండ, కలువాయి 1, కలువాయి 2 సచివాలయాల పరిధిలో ఇద్దరు చొప్పున రాజీనామా చేసినట్టు ఎంపీడీవో పేర్కొన్నారు. అలాగే కలువాయి మండలంలో ఇప్పటి వరకు 83 మంది వలంటీర్లు రాజీనామా చేశారని పేర్కొన్నారు.