ఏపీలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. విజయనగరం(D) రామభద్రపురం(M) కొట్టక్కి జాతీయరహదారిపై రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్ప్లాజా వద్ద కారు, లారీ ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. నెల్లూరు(D) వరికుంటపాడు(M) భోగ్యంవారిపల్లె వద్ద ఆగి ఉన్న లారీని మినీ లారీ ఢీకొట్టగా.. రెండు లారీల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు.