శంకరమఠంలో శనివారం హనుమజ్జయంతి సందర్భంగా లోక కల్యాణం, విశ్వశాంతి చేకూరాలని కోరుతూ శ్రీ రామ సేవా సమితి విజయనగరం శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చనలుచేసి వడలు, అప్పాలు, పండ్లు నివేదన చేసారు. 30మంది సుందరకాండ 12 ఆవ్రుతాలు పారాయణలు చేసారు. శంకరమఠం, సేవాసమితి సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.