శ్రీ గాయత్రి మాత వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
ఎస్ కోట మండలం రాజీపేట సమీపంలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శంబలనగరి శ్రీ గాయత్రీ మాత వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సోమవారం పాల్గొన్నారు. ముందుగా ఆమెకు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె గాయత్రి మాతను దర్శించుకుని పసుపు కుంకుమలను సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆలయ విశిష్టతను ఆమెకు వివరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్