విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య తన మామ సహకారంతో అతడిని కిరాతంగా హత్య చేసింది. వెదుళ్లవలసకు చెందిన కొలుసు అప్పన్న, దేవి దంపతులు. తాగుడుకు బానిససైన అప్పన్న తరచూ భార్యను డబ్బు కోసం ఇబ్బంది పెట్టేవాడు. అనుమానంతో వేధించేవాడు. వేధింపులు భరించలేక దేవి తన మామ ముంత సన్యాసిరావుతో కలిసి భర్త అప్పన్నను హత్య చేసింది.