కెంగువ గ్రామంలో ఇంటింటి ప్ర‌చారం

52చూసినవారు
గ‌జ‌ప‌తిన‌గ‌రం మండ‌లం కెంగువ గ్రామంలో ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి క‌ర‌ప‌త్రాల‌ను పంపిణీ చేశారు. గోడ‌ల‌కు స్టిక్క‌ర్ల‌ను అంటించారు. ఈ వంద రోజుల్లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అంగ‌న్వాడీ కేంద్రాన్ని, పాఠ‌శాల భ‌వ‌నాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ప‌రిశీలించారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్