ఏనుగులు ఎటాక్.. చాకచక్యంగా వ్యవహరించిన రైతు

69చూసినవారు
ఏనుగులు ఎటాక్.. చాకచక్యంగా వ్యవహరించిన రైతు
కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల బెడద రోజురోజుకు పెరుగుపోతుంది. జియ్యమ్మవలస మండలం గౌరీపురం వద్ద ఎడ్లబండితో వెళ్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పెదకుదమ గ్రామానికి చెందిన బోను తిరుపతిరావు శుక్రవారం ఇసుక కోసం నాటుబండిపై వెళ్తుండగా ఏనుగులు ఎటాక్ చేశాయి. చాకచక్యంగా వ్యహరించిన రైతు ఎడ్లు తాలు విప్పి వాటిని తోలేసి తానూ ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా ఏనుగులు నాటుబండిని ధ్వంసం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్