బిత్రపాడులో ఏనుగులు హల్చల్

59చూసినవారు
బిత్రపాడులో ఏనుగులు హల్చల్
జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామ సమీపంలో గల అరటితోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు మంగళవారం అటవీశాఖ అధికారులు తెలిపారు. సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరు బయట తిరగరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగులు గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్