భోగాపురం: బాత్రూంలో జారి పడి కార్మికుడు మృతి

62చూసినవారు
భోగాపురం: బాత్రూంలో జారి పడి కార్మికుడు మృతి
స్నానానికి వెళ్లి బాత్రూంలో కాలుజారి కార్మికుడు మృతిచెందిన ఘటన భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల వద్ద చోటు చేసుకుంది. ఎస్సై పాపారావు వివరాల మేరకు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బ్రిడ్జ్. తుడు(36) శనివారం స్నానానికి వెళ్లి బాత్రూంలో జారిపడి తలకు తీవ్ర గాయమైంది. తగరపువలసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్