వచ్చే ఎన్నికలలో 150 సీట్లు గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు వెల్లడించారు. భోగాపురం మండలం ముంజేరులో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.