జరజాపుపేటలో టిడిపిని వీడి వైసిపిలోకి పలువురు చేరిక
నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో గురువారం పలువురు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. మాజీ వార్డు మెంబరు బొలే సన్యాసప్పడు తన కుటుంబ సభ్యులతో వైసిపిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడు బాబు కండువా వేసి ఆహ్వానించారు. వైసిపి నగరపంచాయతీ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సముద్రపు రామారావు పాల్గొన్నారు.