ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా మలేరియా అధికారి జగన్ మోహన్

65చూసినవారు
ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా మలేరియా అధికారి జగన్ మోహన్
సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రి లేబొరేటరీని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి. జగన్ మోహనరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మలేరియా నిర్ధారణ పరీక్షలు, నివేదికల ల్యాబ్ రికార్డులు ఎం3, ఎంఎఫ్7 లను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ పరీక్షల ద్వారా స్లైడ్స్ ఫలితాల వివరాల పై ఆరా తీశారు. ఆ పరిధిలో ఏఏ ప్రాంతల నుండి జ్వర లక్షణాలతో ఉన్నవారు ఆసుపత్రికి వస్తున్నారో అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్