రాష్ట్ర భవిష్యత్తుకై బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించుకోవాలని పాలకొండ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. భామిని మండలం బత్తిలిలో సోమవారం ఆయన ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. తనకు ఒక అవకాశం ఇస్తే, పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఆయనకు ఓటు వేసి అసెంబ్లీకి వెళ్లేలా ప్రజలు దీవించాలన్నారు.