పార్వతీపురం: పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచండి

82చూసినవారు
పార్వతీపురం: పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచండి
పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద మంగళవారం పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలి అని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా సిపిఎం పట్టణ కార్యదర్శి జి వెంకటరమణ మాట్లాడుతూ.. పార్వతిపురం పట్టణం పెరిగిందని, జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుందని, కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదన్నారు. తగినన్ని పనిముట్లు ఏర్పాటు చేయడం లేదని, కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్