కూటమి అభ్యర్థి కార్యాలయంలో ఉగాది వేడుకలు

76చూసినవారు
కూటమి అభ్యర్థి కార్యాలయంలో ఉగాది వేడుకలు
క్రోధి నామ తెలుగు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా వుండాలని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆకాంక్షించారు. మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని విశాఖ ఏ కాలనీలో నిర్వహించారు. వేద పండితుల పంచాగ శ్రవణం అనంతరం గొండు శంకర్ ను ఆశీర్వదించారు. షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని అందరికి అందజేసారు. టీడీపీ. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్