ఎన్నికలలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్ అన్నారు. సాలూరులో ఎన్నికల సెక్టార్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బందితో బుధవారం సమీక్షించారు. ప్రతి సెక్టార్ అధికారి తన పరిధిలో పోలింగ్ కేంద్రాలు, రూట్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.