ఏప్రిల్ 14 లోపు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

76చూసినవారు
ఏప్రిల్ 14 లోపు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి
ఏప్రిల్ 14 లోపు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్. కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళి రావు తెలిపారు. ఎస్ కోట స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన సోమవారం ఎన్నికల సమావేశాన్ని నిర్వహించి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివరించారు. అధికారులు సమన్వయం చేసుకొని అర్హత గల వారికి హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అనంతరం పట్టణంలో ఎన్నికలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్