చంద్రబాబు హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది

53చూసినవారు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో మాత్రమే బీసీలకు న్యాయం జరిగిందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెంలో ఆదివారం జరిగిన జయహో బీసీ సభలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా చంద్రబాబు కృషి చేశారని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్