సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

65చూసినవారు
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై ఎస్. కోట మండలం ఎస్ కోట తలారి లో ఏఎన్ఎం బి. రమణమ్మ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులో మారడం, ఒళ్ళు, కీళ్ల నొప్పులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం ఈ వ్యాధి లక్షణాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని కోరారు. స్థానిక సర్పంచ్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్