ఎస్ కోట మండలం ఓడ్డు మరుపల్లికి చెందిన దారప్ప అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. గ్రామ సమీపంలో ఓ ముళ్ళపొదలో ఆమె శవమై కనిపించడాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు భర్త కనకారావును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరికి వివాహమై 4 సంవత్సరాలు అయిందని, ఒక కుమారుడు కూడా ఉన్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.