అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

51చూసినవారు
కొత్తవలస మండలం సంతపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన బాధితులను ఎంపీ శ్రీ భరత్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తో కలిసి పరామర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం తరఫున అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము, ప్రధాన కార్యదర్శి కనకాల శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్