మహాత్మా జ్యోతి రావు పూలే జాతికి
చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. పూలే 198వ జయంతిని గురువారం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్లతో ఎంపీ పాటు బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతి రావు పూలే మహనీయుడని కొనియాడారు.