తెలుగు వెలుగులు ప్రసరింపచేసిన రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని వాజీ చానల్ ఎండీ గణపతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం వాజీ చానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు సంస్మరణ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ అక్షరసూరీడు అస్తమించినా ఆ వెలుగులు శాశ్వతమని, ఆయన కీర్తి ఆచంద్రతారార్కమని అన్నారు. జిల్లా ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తదితరులు పాల్గొన్నారు.