చిన్నారిని కాపాడిన యువకులు

77చూసినవారు
భీమిలి బీచ్‌లో పెందుర్తి సమీపంలోని వేపగుంటకు చెందిన 12 ఏళ్ల రష్విత సముద్రంలో కొట్టుకుపోతుండగా బోయవీధికిచెందిన యువకులు రక్షించారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాసరపు సతీష్, వి. సతీష్, కదిరి గౌతమ్ లు పర్యాటకులకు ఫొటోలు తీస్తుండగా రష్విత సముద్రంలో కొట్టుకుపోతుండడాన్ని గమనించారు. వేల రూపాయలు విలువగల కెమెరాలు ఒడ్డున పడేసి ప్రాణాలను రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్