రంగసాయి కళాపీఠం నూతన సంస్థ ఆవిర్భావం

66చూసినవారు
రంగసాయి కళాపీఠం నూతన సంస్థ ఆవిర్భావం
కళారంగం కోసం పరితపించే విశాఖకు చెందిన బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురార్పణ చేశారు. ప్రజల వద్దకే నాటకం, ప్రజల వద్దకు వివిధ కళారూపాలను తీసుకువెళ్లడం కోసం రంగ‌సాయి క‌ళాపీఠం ఏర్పాటు చేశారు. బుధ‌వారం ప్రముఖ వైద్యులు పి. వి. రమణమూర్తితో పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగ స్థల సినీ నటి, శివజ్యోతి, రంగసాయి టీమ్ సభ్యులు ఆదినారాయణ, వియ్యపు రామకృష్ణ, జమ్మా చినబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్