ఎన్‌ఏడీలో కుమ్మతున్న వర్షం

83చూసినవారు
విశాఖలో వర్షం కు‍మ్మేస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్‌ఏడీ ఫ్లైవోవర్‌వద్ద శుక్రవారం రాత్రి భారీ వర్షానికి నీరు చేరింది. భారీగా ట్రాఫిక్‌స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్