చోడవరం నియోజకవర్గం పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం కే పి అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గ్రామ సర్పంచ్ గోపిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువ నాయకులు శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ తనయుడు కరణం సూర్య కెపి అగ్రహారం గ్రామంలో గురువారం ఉదయం ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి కరణం ధర్మశ్రీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.