మావోయిస్టు మిలీషియా సభ్యులు 17 మంది లొంగుబాటు

61చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్రా - ఒడిశా సరిహద్దు పెదబయలు, జీకేవీధి సరిహద్దు కొండల్లో మావోయిస్టులకు సహకరించే మిలీషియా సభ్యులు 17 మంది మంగళవారం ఎస్పీ అమిత్ బర్దర్ ముందు లొంగిపోయారు. వీరంతా కొన్నేళ్లుగా మావోయిస్టులకు సహకరించి విసిగి చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమ సిబ్బందిని కలిసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్