జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి వస్తున్న బిజెపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే ప్రధాన లక్ష్యం అని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ మంగళవారం అల్లూరి జిల్లా పాడేరులో తెలిపారు. గతంలో అరకు పార్లమెంటులో ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత, నకిలీ కులదృవీకరణ పత్రాలతో మళ్లీ పోటీ చేయడం గిరిజనలను మోసం చేసినట్టే అని విమర్శించారు. ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు.