అల్లూరి జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

63చూసినవారు
అల్లూరి జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ అభిషేక్ సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్లను మందలించారు.

సంబంధిత పోస్ట్